తిరుపతి - గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు నేడు 2:30 గంటలు ఆలస్యం

ABN , First Publish Date - 2021-07-25T06:20:54+05:30 IST

తిరుపతి-గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు (07656) ఆదివారం 2:30 గంటలపాటు ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

తిరుపతి - గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు  నేడు 2:30 గంటలు ఆలస్యం

అనంతపురం రైల్వే, జూలై 24: తిరుపతి-గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు (07656) ఆదివారం 2:30 గంటలపాటు ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అండర్‌ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఈ రైలు మార్గాన్ని కొన్ని గంటలపాటు బ్లాక్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ మార్గంలో వచ్చే ప్యాసింజర్‌ తిరుపతిలో ఉదయం 8:35 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 1:50 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నెంబర్‌ 127 ఏ, 140 ఏ సబ్‌వే నిర్మాణంలో భాగంగా తిరుపతి, చంద్రగిరి స్టేషన్ల మధ్యలో ఆదివారం ఉదయం 07:30 నుంచి 11 గంటల వరకు అన్ని రైళ్ల రాకపోకలను 3:30 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-25T06:20:54+05:30 IST