Palnaduలో రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-21T13:58:47+05:30 IST
జిల్లాలోని పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పల్నాడు: జిల్లాలోని పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలు, అప్పుల బాధ తాళలేక రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 45 రోజుల క్రితం సత్య వర్ధన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.