ఫోన్ ట్యాపింగ్పై రైల్వే కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2021-07-27T06:46:23+05:30 IST
ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోన్ అధ్యక్షుడు సత్యనారాయణ, అదనపు కార్యదర్శి అరుణ్కుమార్ ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోన్ అధ్యక్షుడు సత్యనారాయణ, అదనపు కార్యదర్శి అరుణ్కుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్రావు, కార్యదర్శి రవీందర్ పిలుపు మేరకు సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆలిండియా రైల్వే ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు స్వామి, కరీముల్లా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.