రైల్వే విద్యుదీకరణ పనులు పరిశీలన

ABN , First Publish Date - 2021-01-21T04:10:38+05:30 IST

ఉండి రైల్వేస్టేషన్‌ పరిధిలో విద్యుదీకరణ పనులను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ పరిశీలించారు.

రైల్వే విద్యుదీకరణ పనులు పరిశీలన
ఉండి రైల్వేస్టేషన్‌ పనులను పరిశీలిస్తున్న అధికారులు

ఉండి, జనవరి 20 : ఉండి రైల్వేస్టేషన్‌ పరిధిలో విద్యుదీకరణ పనులను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ పరిశీలించారు. గుడివాడ మీదుగా ప్రత్యేక ట్రైన్‌లో బుధవారం ఉండి చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో వివిధ అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జ రుగుతున్న పనులపై చర్చించారు. పెద అమిరంలో 132–25కెవి విద్యుత్‌ సబ్‌ స్టేష న్‌ను పరిశీలించారు. ఉండిలో 220 కెవి సబ్‌ స్టేషన్‌ నుంచి పెదఅమిరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ చార్జ్‌ చేశారు.

Updated Date - 2021-01-21T04:10:38+05:30 IST