రైల్‌విహార్‌లో ఘనంగా వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T04:53:18+05:30 IST

స్థానిక నల్లపాడులోని రైల్‌విహార్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

రైల్‌విహార్‌లో ఘనంగా వేడుకలు
నల్లపాడులోని రైల్‌విహార్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌రాజా

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక నల్లపాడులోని రైల్‌విహార్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌.మోహన్‌రాజా జాతీయ జెండాని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ దళాల పరేడ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే అధికారులు, ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి. 

రైల్వే ఉద్యోగార్ధులకు విజ్ఞప్తి

రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుంటూరు రైల్వే డివిజనల్‌ అధికారి ఒక విజ్ఞప్తి చేశారు. కొంతమంది అభ్యర్థులు రైల్వేట్రాక్‌లపై రాస్తారోకోలు, రైళ్లను అడ్డుకోవాలని చూడటం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం వంటి సంఘటనల్లో భాగాస్వామ్యం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై వచ్చిన అభియోగాలను విచారించి తగిన పోలీసు యాక్షన్‌ తీసుకోవడంతో పాటు జీవితకాలం రైల్వే ఉద్యోగం లభించకుండా డీబార్‌ చేయడం జరుగుతుందన్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకు నిబద్ధతతో పని చేస్తోన్నాయన్నారు.  

Updated Date - 2022-01-27T04:53:18+05:30 IST