పోలీసులకు లొంగిపోయిన రాహుల్ హత్యకేసు నిందితుడు
ABN , First Publish Date - 2021-08-22T21:00:15+05:30 IST
పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. మాచవరం పోలీస్స్టేషన్లో కోరాడ విజయ్ లొంగిపోయాడు.
విజయవాడ: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. మాచవరం పోలీస్స్టేషన్లో కోరాడ విజయ్ లొంగిపోయాడు. రాహుల్ హత్యకేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ని రహస్యప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న రాహుల్ని కారులో నిందితులు హత్యచేశారు. రాహుల్ హత్యకేసులో కోరాడ విజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రాహుల్ హత్య వెనుక విజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నా, మరో బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉన్నట్టు ఆధారాలు లభించాయి. రాహుల్కు, విజయ్ మధ్య లాక్డౌన్ నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఇదంతా రూ.కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరికీ వయస్సురీత్యా చాలా వ్యత్యాసం ఉంది. ఈ డబ్బు గొడవల నేపథ్యంలో కోరాడ ఈ హత్యకు కిరాయి హంతకులను నియమించాడా లేక రాహుల్ వద్ద ఉండే వారినే హంతకులుగా మార్చాడా అన్నది తెలియాల్సి ఉంది. హత్య జరిగిన సమయంలో కోరాడ అక్కడికి సమీపంలో ఉన్నట్టు సమాచారం.