మోగా నుంచి రాహుల్ ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-12-26T20:30:05+05:30 IST

పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి..

మోగా నుంచి రాహుల్ ఎన్నికల ప్రచారం

న్యూఢిల్లీ: పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టునున్నారు. జనవరి 3న మోగాలో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లలో 77 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సాద్-బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 20 సీట్లు గెలిచి రెండవ పెద్ద పార్టీగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీ కేవలం 3 సీట్లు సాధించింది.

Updated Date - 2021-12-26T20:30:05+05:30 IST