రాహుల్ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-01T22:15:19+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు నిర్భంధించడం పాశివిక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

రాహుల్ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది: రేవంత్‌రెడ్డి

అమరావతి: ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు నిర్భంధించడం పాశివిక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి సంఘాలను కలిసేందుకు జగ్గారెడ్డి వెళితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ పర్యటన సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందన్నారు. రాహుల్ ఉస్మానియా వర్సిటీ వస్తానంటే అడ్డుకోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంత రాజ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం.. అనుభవిస్తున్న భోగాలన్నీ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష అని అన్నారు. కేసీఆర్ ఒక పిరికి పాలకుడని, ఆయన పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-01T22:15:19+05:30 IST