రాహుల్ అసూయే అందుకు కారణం: ఉమాభారతి

ABN , First Publish Date - 2020-07-13T21:03:29+05:30 IST

రాజస్థాన్‌లో‌ తలెత్తిన రాజకీయ విభేదాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే బాధ్యుడని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి..

రాహుల్ అసూయే అందుకు కారణం: ఉమాభారతి

సెహోర్: రాజస్థాన్‌లో‌ తలెత్తిన రాజకీయ విభేదాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే బాధ్యుడని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి అన్నారు. పార్టీలో యువ నాయకులను రాహుల్ ఎదగనీయడం లేదని, కాంగ్రెస్ పతనానికి ఆయన అసూయే కారణమని ఆరోపించారు.


సోమవారంనాడిక్కడ మీడియాతో ఉమాభారతి మాట్లాడుతూ, రాజస్థాన్‌లో తలెత్తిన పరిణామాలకు రాహులే బాధ్యుడని అన్నారు. పార్టీలోని యువనాయకులను ఎదగనీయకుండా చేస్తున్నారని, పార్టీని ఆయన అదుపు చేయడం చేతకాక తమపై (బీజేపీపై) నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. 


'చదువు, సమర్ధత కలిగిన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి వారికి ఉన్నత పదవులిస్తే తాను వెనుకబడి పోతానని రాహుల్ అనుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఉన్న అసూయ అలాంటిది. రాజస్థాన్‌లో పరిణామాలకు మేము ఎంతమాత్రం బాధ్యులం కాదు. నాయకులెవరైనా మాతో కలిసి వస్తామంటే, వారు సమర్ధులైతే, తప్పనిసరిగా స్వాగతిస్తాం' అని ఉమాభారతి చెప్పారు.

Updated Date - 2020-07-13T21:03:29+05:30 IST