జలియన్వాలా బాఘ్ను సందర్శించిన రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2022-01-27T23:12:05+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించారు. గురువారం ఆయన ముందుగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం అమరవీరుల స్మారకమైన జలియన్వాలా బాఘ్ను..
అమృత్సర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించారు. గురువారం ఆయన ముందుగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం అమృత్సర్లోనే ఉన్న అమరవీరుల స్మారకమైన జలియన్వాలా బాఘ్ను సాయంత్రం సమయంలో సందర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ వెంట వచ్చారు. జలియన్వాలా బాఘ్ ఎంట్ర పుస్తకంలో రాహుల్ సంతకం చేస్తున్న చిత్రాలు, అమరవీరుల స్థూపం వద్ద జలియన్వాలా అమరులకు నివాళులు అర్పిస్తున్న ఫొటోలను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.