మధురైలో నేడు రాహుల్ పర్యటన
ABN , First Publish Date - 2021-01-14T12:21:46+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ గురువారం తమిళనాడులోని మదురై జిల్లాకు రానున్నారు.
చెన్నై: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జల్లికట్టు క్రీడను వీక్షించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ గురువారం తమిళనాడులోని మదురై జిల్లాకు రానున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా అవనియాపురం వస్తున్న రాహుల్.. అక్కడ జల్లికట్టును వీక్షించనున్నారు. అనంతరం అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్.. ఈ నెలాఖరున రావాల్సివుంది.
మూడు రోజుల పాటు ఆయన వివిధ జిల్లాల్లో రోడ్షో నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. కానీ ఇంతలోనే ఆయన అవనియాపురం పర్యటనకు వస్తున్నట్లు టీఎన్సీసీ కార్యాలయానికి కబురందింది. దీంతో కాంగ్రెస్తో పాటు డీఎంకే నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ ప్రాచీన సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును వీక్షించేందుకు రాహుల్ వస్తుండడం ఎన్నికల్లో తమకు కలిసొచ్చే అంశంగా రెండు పార్టీలు భావిస్తున్నాయి.