ED ముందు మళ్లీ హాజరైన Rahul Gandhi
ABN , First Publish Date - 2022-06-21T20:05:42+05:30 IST
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఐదవరోజైన మంగళవారంనాడు కూడా కాంగ్రెస్ మాజీ..
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఐదవరోజైన మంగళవారంనాడు కూడా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యాయి. సెక్యూరిటీ ఎస్కార్ట్తో ఆయన మధ్యాహ్నం 11.15 గంటల ప్రాంతంలో ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సెక్షన్ 144 అమలులో ఉన్నప్పటికీ భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలను ఈడీ కార్యాలయం చుట్టూ మోహరించారు.
రాహుల్ గాంధీ నాల్గవ రోజైన సోమవారం కూడా 12 గంటల సేపు ఈడీ విచారణలో పాల్గొన్నారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ నాలుగు సిట్టింగ్స్లో 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈనెల 23న ఈడీ విచారణను ఎదుర్కోవలసి ఉంది. సోనియాగాంధీ కరోనా అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆసుపత్రిలో వారం రోజుల క్రితం చేరి సోమవారంనాడు డిశ్చార్జి అయ్యారు.