రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలు చేస్తున్నారు : రాహుల్

ABN , First Publish Date - 2020-09-20T18:11:28+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై

రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలు చేస్తున్నారు : రాహుల్

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రయత్నాన్ని తామెన్నడూ సఫలం కానివ్వమని ఆయన స్పష్టం చేశారు.


ఈ మేరకు రాహుల్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవసాయ బిల్లుల్లో కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేకపోతుందంటూ ట్విట్టర్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-20T18:11:28+05:30 IST