రాహుల్ మతిలేని నేత: ప్రహ్లాద్ జోషి

ABN , First Publish Date - 2022-02-03T02:37:44+05:30 IST

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ..

రాహుల్ మతిలేని నేత: ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ కేంద్రంపై చేసిన పలు విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తిప్పికొట్టారు. ఆయన (రాహుల్) గందరగోళం మనిషి, మతిలేని నేత అంటూ విమర్శించారు. ''ఇండియా ఒక దేశం కాదని ఆయన చెబుతున్నారు. చైనా విజన్ చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. చైనాను సపోర్ట్ చేసేందుకు మీరు ఇక్కడకు వచ్చారా అని అడుగుతున్నాను. టిబెట్ సమస్యకు కారణం కాంగ్రెస్సే'' అని ఆయన అన్నారు. ప్రధాని మోదీని 'కింగ్' అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై ప్లహ్లాద్ జోషి స్పందిస్తూ, గాంధీ కుటుంబం నుంచి వచ్చినందువల్లే రాహుల్‌కు మాట్లాడే అవకాశం వచ్చిందని, మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతగా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడని అన్నారు.

Updated Date - 2022-02-03T02:37:44+05:30 IST