తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన రాహుల్

ABN , First Publish Date - 2021-08-17T20:55:04+05:30 IST

తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, నియోజకవర్గంలోని అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యం సాకారమయ్యేందుకు..

తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన రాహుల్

వయనాడ్: తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, నియోజకవర్గంలోని అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే  లక్ష్యం సాకారమయ్యేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో రాహుల్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పొన్‌కుళిలోని పొన్‌కుళి కుట్టినాయక కాలనీలో మంచినీటి ప్రాజెక్టును మంగళవారంనాడు ఆయన ప్రారంభించారు. తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్న వారికి, ముఖ్యంగా కుటుంబంలోని తల్లులు, చెల్లెళ్లకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, కష్టం కొంతైనా తగ్గుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ తాగునీరు అందించే దిశగా వేసిన ముందడుగు ఇదని అన్నారు.

Updated Date - 2021-08-17T20:55:04+05:30 IST