నా ప్రశ్నలకు స్వయంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-06T01:02:01+05:30 IST

నా ప్రశ్నలకు స్వయంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

నా ప్రశ్నలకు స్వయంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

సిద్దిపేట: తెలంగాణలో రాహుల్ గాంధీ  పర్యటనపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వరంగల్‌లో కాంగ్రెస్ పెద్దలు రైతు సభ అని పేరు పెట్టి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని పిలిశారని నిరంజన్ రెడ్డి అన్నారు. సభ పెట్టుకోవడానికి ఎవరికి ఆక్షేపణ లేదని, అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిందని, వాళ్ల కాలంలో రైతాంగానికి ఏం చేసిందో వాటి అన్నింటికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని మంత్రి ప్రశ్నించారు. బాధ్యతగల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశానని చెప్పారు. లేఖలో పేర్కొన్న అంశాలపై చిల్లర మల్లర మాటలు కాకుండా ఎవరితోనో చెప్పిస్తారో కానీ రాహుల్ గాంధీ కూడా జబాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తాను రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నలకు స్వయంగా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని, తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more