TS News: టి.కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌గాంధీ మరోసారి వార్నింగ్‌

ABN , First Publish Date - 2022-05-07T22:03:31+05:30 IST

కాంగ్రెస్‌ నేతలకు ఈ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. గాంధీభవన్ కాంగ్రెస్ (Congress) నేతలతో ఆయన భేటీ అయ్యారు.

TS News: టి.కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌గాంధీ మరోసారి వార్నింగ్‌

హైదరాబాద్: టి.కాంగ్రెస్‌ నేతలకు ఈ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. గాంధీభవన్ కాంగ్రెస్ (Congress) నేతలతో ఆయన భేటీ అయ్యారు. పనిచేయకపోతే సీనియర్‌ నేతలకైనా టికెట్‌ రాదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో కూర్చున్న వారికి టికెట్‌ రాదని, జనం మధ్య ఉండి కష్టపడేవారికే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. కొందరు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడి పార్టీకి నష్టం చేస్తున్నారని ఆక్షేపించారు. మీడియాతో ఏదిపడితే అది మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుందామన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్‌గాంధీ సూచించారు.


పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్ దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక బాగుపడింది సీఎం కేసీఆర్ (KCR) కుటుంబమేనని విమర్శించారు. భవిష్యత్‌లో ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినవారితో పొత్తులు ఉండవన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ నష్టం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ దగ్గర డబ్బు, అధికారం ఉందికానీ.. జనబలం లేదన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పార్టీలో సమైక్యత అవసరమని రాహుల్‌ రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు.

Read more