చివరి రోజున టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు

ABN , First Publish Date - 2021-10-27T00:13:04+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు

చివరి రోజున టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ క్రికెట్ ఆపరేషన్స్  హెడ్‌గా ఉన్న ద్రవిడ్ దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజైన నేడు తన దరఖాస్తును సమర్పించాడు. అలాగే, ద్రవిడ్ నమ్మిన బంటు, మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నిన్న బౌలింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు సమర్పించాడు.  


ఇటీవల జరిగిన ఐపీఎల్ సందర్భంగా ద్రవిడ్‌తో సమావేశమైన బీసీసీఐ సారథి సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నెల మొదట్లో పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌ల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు 26వ తేదీని గడువుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు ద్రవిడ్ తన దరఖాస్తును సమర్పించాడు. 

Updated Date - 2021-10-27T00:13:04+05:30 IST