రోశయ్య పేరు శాశ్వతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి: రఘువీరారెడ్డి

ABN , First Publish Date - 2021-12-15T19:36:56+05:30 IST

రెండు తెలుగు ప్రభుత్వాలు రోశయ్యను తగిన రీతిలో గౌరవించాలని రఘువీరారెడ్డి కోరారు.

రోశయ్య పేరు శాశ్వతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి: రఘువీరారెడ్డి

హైదరాబాద్: రెండు తెలుగు ప్రభుత్వాలు రోశయ్యను తగిన రీతిలో గౌరవించాలని, రోశయ్య పేరు శాశ్వతంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలోని ప్రతి మండలాన్ని సందర్శించిన ఏకైక నాయకుడు రోశయ్య మాత్రమేనని కొనియాడారు. ఆర్థికశాఖపై టెంట్ హక్కు రోశయ్యది మాత్రమేనన్నారు. సంయమనం..‌ సమయస్ఫూర్తి ఏ విధంగా ఉండాలనేది నేటి తరం రోశయ్య నుంచి నేర్చుకోవాలన్నారు. కొత్త నాయకులు రోశయ్య  ప్రసంగాల నుంచి స్పూర్తి పొందాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు.

Updated Date - 2021-12-15T19:36:56+05:30 IST