రాధాకు ఏమైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు: రఘురామ
ABN , First Publish Date - 2021-12-29T20:12:23+05:30 IST
సీఎం జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు.
ఢిల్లీ: సీఎం జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి రాధాకృష్ణపై హత్యకు రెక్కీ జరిగిందని తెలిసిందన్నారు. వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. రెక్కీపై పారదర్శకమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను పక్కదారి పట్టించేందుకే.. తెరపైకి సినిమా సమస్యను తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో సిద్ధార్థ్కి ఏపీతో సంబంధం ఏంటని పేర్ని నాని అంటున్నారు.. మరీ జస్టిస్ చంద్రు, కనగరాజుకు ఏపీతో పనేంటని ప్రజలంటున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆముల్పై చూపిన ప్రేమ అందరిపై చూపాలని రఘురామరాజు వ్యాఖ్యానించారు.