నా అరెస్ట్కు వైవీ సుబ్బారెడ్డి, రంగనాథరాజు కుట్ర: రఘురామరాజు
ABN , First Publish Date - 2021-02-26T03:58:48+05:30 IST
నా అరెస్ట్కు వైవీ సుబ్బారెడ్డి, రంగనాథరాజు కుట్ర: రఘురామరాజు
హైదరాబాద్: శుక్రవారం తన నియోజకవర్గానికి వెళ్లనివ్వకుండా వైవీ సుబ్బారెడ్డి, రంగనాథరాజు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు. సిద్ధాంతం బ్రిడ్జి దగ్గర గొడవ చేయాలని ప్లాన్ చేశారని ఆయన తెలిపారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అరెస్టు చేయాలని కుట్ర పన్నారా అని ప్రశ్నించారు. ‘‘ఇంతకు ముందు ఎన్నడూలేని విధంగా మీ కులానికి చెందిన రెడ్లను అధికారులుగా నియమించుకున్నారు. ఇది జగన్కు తెలిసి జరుగుతుందా? తెలియకుండా జరుగుతోందా?. సీఎం ధైర్యవంతుడు, పిరికివాడు కాదు. ఇంత నాసిరకంగా, బేలగా రోడ్లపై జనాల్ని పెట్టి అర్ధం లేని కేసులు పెడుతున్నారు. ఒక ఎంపీపై కుట్ర చేసే అథమ స్థాయికి సీఎం వెళ్లరనే భావిస్తున్నా. మా లాయర్లతో మాట్లాడి కోర్టుకు వెళ్లడంపై ఆలోచిస్తా. నేను మళ్లీ నర్సాపురం వెళ్తా.’’ అని రఘురామరాజు చెప్పారు.