ఆ విషయంలో జగన్ అల్లరి పాలయ్యారు: రఘురామ

ABN , First Publish Date - 2022-02-27T19:21:56+05:30 IST

నాపై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

ఆ విషయంలో జగన్ అల్లరి పాలయ్యారు: రఘురామ

ఢిల్లీ: తనపై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్‌రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారి నాపై కుట్రలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి మైండ్‌లో ఏముంది?.ఎలాగో ఏపీకి రానివ్వడం లేదు, హైదరాబాద్ కూడా రానివ్వరా ఏంటి?.ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటికీ యాక్షన్ తీసుకోలేదు.సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలే గమనిస్తున్నారు’’  అని  రఘురామ అన్నారు. 

‘‘ఒక ఎంపీకి ప్రశాంతంగా జీవించే హక్కు లేదా? నా హక్కును హరించే అధికారం జగన్‌కి ఎవరిచ్చారు?.నా వ్యక్తిగత హక్కును హరిస్తున్నారు. ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా, ప్రివిలేజ్‌ కమిటీకి లేఖ రాశాను. నాపై నిఘా, పవన్‌పై పగ జగనన్నకి ఎందుకు?భీమ్లానాయక్‌లో పవన్‌ అద్భుతంగా నటించారు. పవన్‌ ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్‌ చేస్తే. పేర్నినాని ఎక్స్‌ట్రార్డినరీ ఓవర్‌ యాక్షన్‌ చేశారు.భీమ్లానాయక్‌పై పేర్నినాని సారథ్యంలో జగన్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నో కుట్రలు, కొన్ని చోట్ల థియేటర్లు బంద్ చేశారు, అరాచకాలు సృష్టించారు. అవసరం లేకపోయినా సినిమా విషయంలో జగన్ అల్లరి పాలయ్యారు. సీఎం జగన్ వైఖరితో మా పార్టీ దెబ్బతింటుంది’’ అని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

Updated Date - 2022-02-27T19:21:56+05:30 IST