కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే బిల్లు రద్దు వెనక్కి..: రఘురామ

ABN , First Publish Date - 2021-11-23T19:55:29+05:30 IST

10 రోజుల్లో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని.. ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం బిల్లును వెనక్కి...

కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే  బిల్లు రద్దు వెనక్కి..: రఘురామ

న్యూఢిల్లీ: మరో 10 రోజుల్లో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని..ముందే గ్రహించిన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును  ఉపసంహరించుకుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం అమరావతి రైతులు మహాపాదయాత్ర కొనసాగించాలని సూచించారు. సీఆర్డీఏలో రాజ్‌భవన్, సెక్రటేరియట్, హైకోర్టు ఉంటాయని..గతంలో అగ్రిమెంట్ రాశారన్నారు. మూడు రాజధానులతో వస్తామని నిన్న సీఎం జగన్ స్పష్టం చేశారని, 3 రాజధానుల అంశంలో ప్రభుత్వం వెనక్కి వెళ్లేదేలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు, రాజధానికి సంబంధం లేదని, ఇప్పటికైనా సీమ రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Updated Date - 2021-11-23T19:55:29+05:30 IST