జగన్‌కు మరో లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

ABN , First Publish Date - 2020-07-05T21:32:50+05:30 IST

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల

జగన్‌కు మరో లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

ఏలూరు: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారని తెలిపారు. 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని, దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్‌ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలన్నారు. చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని రఘురామకృష్ణరాజు చెప్పారు.

Updated Date - 2020-07-05T21:32:50+05:30 IST