సీఐడీ అధికారులకు లేఖ రాసిన ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2022-01-17T17:57:45+05:30 IST
అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులకు లేఖ రాశారు.
అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. తాను అత్యవసర పనిపై ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని, అనారోగ్య కారణాలతో డాక్టర్స్ను సంప్రదించాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సోమవారం సీఐడీ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాల్సిందిగా రఘురామ కృష్ణంరాజుకు ఈనెల 12వ తేదీన ఎపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. నాలుగు వారాలపాటు తనకు సమయం ఇవ్వాలని కోరిన ఆయన ఆ కాపీని సీఐడీ ఏడీజీకి పంపారు.