కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు రఘురామ లేఖ
ABN , First Publish Date - 2021-08-04T01:26:25+05:30 IST
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. ఏపీలో ఎన్జీఆర్వో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని
ఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. ఏపీలో ఎన్జీఆర్వో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని, నిధులు కేంద్రం మంజూరు చేసినా... ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గత రెండేళ్లుగా చెల్లించడం లేదని తెలిపారు. ఎన్జీఆర్వోఎస్ నిధులను కేంద్రమే నేరుగా లబ్ధిదారులకు చెల్లించాలని లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.