ఏపీ సీఎస్కు రఘురామ లేఖ
ABN , First Publish Date - 2021-12-04T22:39:46+05:30 IST
సీఎస్ సమీర్శర్మకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ తమ పథకాలకు..
అమరావతి: సీఎస్ సమీర్శర్మకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ తమ పథకాలకు.. రాష్ట్ర సీఎం పేరుతో నామకరణం చేయడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం పేర్లు పెట్టడం సరికాదని తప్పుబట్టారు. కేంద్రం సూచించిన విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం పెట్టిన పేర్లు తొలగించాలని లేఖలో కోరారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు నిలిపివేసే అవకాశం ఉందని తెలిపారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ను రఘురామ కోరారు.