రాజధానిపై ప్రజల అభిప్రాయం తీసుకోండి: రఘురామ రాజు

ABN , First Publish Date - 2020-07-04T23:16:20+05:30 IST

అమరావతి రైతుల ఉద్యమం 200 రోజులకు చేరుకున్న విషయం తెలిసిందే. రైతులకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంఘీభావం తెలిపారు.

రాజధానిపై ప్రజల అభిప్రాయం తీసుకోండి: రఘురామ రాజు

ఇంటర్నెట్ డెస్క్: అమరావతి రైతుల ఉద్యమం 200 రోజులకు చేరుకున్న విషయం తెలిసిందే. రైతులకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంఘీభావం తెలిపారు. అంతేకాదు రాజధానిపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల అంకితభావం గొప్పదని, రోజూ గమనిస్తున్నానని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వాలు కొనసాగుతుంటాయన్నారు. వైసీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి కొనసాగుందని అన్నారని, నిండు సభలో జగన్ కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. 3 రాజధానులపై ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సూచనలు, సలహాలను ప్రభుత్వం గమనంలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించాలన్నారు. ‘నా ప్రభుత్వానికి ఇది నా విన్నపం’ అని ముగించారు. 

Updated Date - 2020-07-04T23:16:20+05:30 IST