కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదు: రఘురామకృష్ణరాజు

ABN , First Publish Date - 2020-10-01T21:45:26+05:30 IST

కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదు: రఘురామకృష్ణరాజు

కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదు: రఘురామకృష్ణరాజు

ఢిల్లీ: అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ తీసుకున్న అప్పులు ఏ రాష్ట్రం తీసుకోలేదన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అప్పులు చేస్తున్నప్పటికీ అభివృద్ధిలో వారు పురోగతి సాధిస్తున్నారని కొనియాడారు. మీతో స్నేహపూర్వకంగా మెదులుతున్న కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అమరావతిపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. రోడ్లు దెబ్బతిని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. హిందూ ధార్మిక సంస్థల డబ్బుతో నడిచే ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీకి క్రిస్టియన్‌ని ప్రిన్సిపల్‌గా నియమించవద్దని సూచించారు. 

Updated Date - 2020-10-01T21:45:26+05:30 IST