జగన్ రెడ్డి మగాడు అనుకున్నా... కానీ: రఘురామరాజు

ABN , First Publish Date - 2020-09-21T17:09:36+05:30 IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

జగన్ రెడ్డి మగాడు అనుకున్నా... కానీ: రఘురామరాజు

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జగన్ మగాడు అనుకున్నానని... కానీ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో పార్లమెంట్ వెలుపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన.. ‘‘ప్రజాకంటకంగా ఉంటే.. ప్రజలు, ప్రజాప్రతినిధులు అడ్డం కొట్టే పరిస్థితి వస్తుంది. అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోండి. మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేయండి. గతంలో నేను చెప్పినట్టుగానే నాపై కొన్ని కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. నన్ను చంపేస్తానని చెప్పిన వ్యక్తితోనే కేసులు పెట్టిస్తున్నారు. నాకు తెలిసిన జగన్ రెడ్డి ఎంతో ధైర్యవంతుడు. ఆయన మగాడు.. మొనగాడు అనుకున్నాను. ఈ రకంగా స్థాయి తగ్గించుకుంటాడని అనుకోలేదు. ఉన్నతంగా ఉండాలని అనుకునేవాడిని... మీకు మీరు తగ్గించేసుకుంటారని అనుకోలేదు. నాస్థాయి పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. మీ స్థాయి తగ్గడం బాధగా ఉంది. మీ స్థాయిని తగ్గించుకోకండి. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడుకుందాం. మీరు ప్రయోగించిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ప్రజల దృష్టిలో మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ముగించారు. 

Updated Date - 2020-09-21T17:09:36+05:30 IST