ఏడీజీ సునీల్‌కుమార్‌పై రఘురామ ఫిర్యాదు.. స్పందించిన కేంద్రం

ABN , First Publish Date - 2021-08-09T21:42:23+05:30 IST

ఏడీజీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు లేఖను

ఏడీజీ సునీల్‌కుమార్‌పై రఘురామ ఫిర్యాదు.. స్పందించిన కేంద్రం

ఢిల్లీ: ఏడీజీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు లేఖను ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు కేంద్రం పంపింది. లేఖలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సునీల్‌కుమార్ భార్య గృహ హింస కేసులో చార్జ్‌షీట్‌ దాఖలైన కారణంగా.. ప్రాధాన్యతలేని శాఖకు బదిలీ చేయాలని లేఖలో  రఘురామకృష్ణరాజు కోరారు.

Updated Date - 2021-08-09T21:42:23+05:30 IST