రఘురామ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదు: సజ్జల

ABN , First Publish Date - 2022-01-08T00:14:48+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

రఘురామ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదు: సజ్జల

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచీ రాజీనామా చేయాలని అడుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రకటనపై పెద్దగా స్పందించనవసరం లేదని కొట్టిపారేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చకోర పక్షిలా‌ తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. పొత్తు కోసం అటువైపు ఎదురు చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.


త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని ఒకింత సవాల్ విసిరారు. అంతటితో ఆగని ఆయన.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజధాని అమరావతి ఎజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-01-08T00:14:48+05:30 IST