సారా మరణాలపై దృష్టిమళ్లించేందుకే పెగాసెస్: రఘురామ
ABN , First Publish Date - 2022-03-22T20:19:55+05:30 IST
కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణాలంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
ఢిల్లీ : కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణాలంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. కల్తీ బ్రాండ్లపై ప్రధాని, ఆరోగ్యశాఖమంత్రికి గతంలో లేఖ రాశానన్నారు. దీని వెనుక ఎవరున్నారో అన్నీ బయటకు వస్తాయన్నారు. కల్తీ మద్యంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని రఘురామ డిమాండ్ చేశారు. సారా మరణాలపై దృష్టిమళ్లించేందుకే పెగాసెస్ను తెరపైకి తెచ్చారన్నారు. ఏపీ అసెంబ్లీలో బూతులు తప్ప ప్రజా సమస్యలపై చర్చలేదని రఘురామ పేర్కొన్నారు.