ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం..: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-02-21T21:15:20+05:30 IST

గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం..: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయామన్నారు. గౌతమ్‌తో 18 ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. ఆయన మంత్రిగా ప్రమాణం చేసిన రోజున హైదరాబాద్‌లో సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన అభినందన సభలో కలిశామని, ఆ తర్వాత కూడా చాలా సార్లు కలుసుకున్నామని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి చాలా కృషి చేశారన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేశారని, ఆణిముత్యంలాంటి వ్యక్తిని కోల్పోయామన్నారు. ఆయన మృతి, రాష్ట్రానికి తీరని లోటన్నారు. గౌతమ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు రఘురామ తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

Updated Date - 2022-02-21T21:15:20+05:30 IST