మహాపాదయాత్రకు ప్రజలంతా మద్దతు తెలపాలి: రఘురామ

ABN , First Publish Date - 2021-11-08T18:26:51+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు.

మహాపాదయాత్రకు ప్రజలంతా మద్దతు తెలపాలి: రఘురామ

న్యూఢిల్లీ: అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా మహాపాదయాత్రకు మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు. పాదయాత్రకు వెళ్లలేనివారు సోషల్ మీడియా ద్వారా నిరసన తెలపాలని సూచించారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ పాదయాత్రను పోలీసులు ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.


గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అలాగే జగన్ పాదయాత్రకు కూడా అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. కాగా అమరావతి రైతుల పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చిందన్నారు. అయినా ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ విమర్శించారు. 

Updated Date - 2021-11-08T18:26:51+05:30 IST