రాజీనామా అంటే గూబ పగిలిపోద్ది
ABN , First Publish Date - 2020-08-15T08:30:58+05:30 IST
మరోసారి తనను రాజీనామా చేయాలని అంటే గూబ పగిలిపోద్దని నరసాపురంఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరిం చారు. తనను ఫోన్లో బెదిరించినవారిపై శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు...
- ఫోన్ బెదిరింపులపై రఘురామ ఆగ్రహం
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మరోసారి తనను రాజీనామా చేయాలని అంటే గూబ పగిలిపోద్దని నరసాపురంఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరిం చారు. తనను ఫోన్లో బెదిరించినవారిపై శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. ‘కడప నుంచో, కర్నూలు నుంచో సీఎం జగన్మోహన్రెడ్డి సొంత సామాజిక వర్గం వారు నాకు ఫోన్ చేసి.. ఒరేయ్ నా కొ.. నిన్ను లేపేస్తామని బెదిరిస్తున్నారు. సీఎంగారు పట్టించుకోరు. నిన్న వైఎస్ రెడ్డి అంట.. నేడు రామిరెడ్డి అంట, నాకు ఫోన్ చేసి నన్ను ఏదో చేస్తారంట.. ఏంట్రా చేసేది... మీరు నా ఇం టికి రండి. సీఆర్పీఎఫ్ వాళ్లు షూట్ చేసేస్తారు. ఏయ్ రెడ్డీస్.. ఏంట్రా మీరు చేసేది.. యూజ్ లెస్ ఫెలోస్.. రాజీనామా చెయ్యాలంటూ నన్ను బెదిరిస్తారా? నేను ప్రజల మద్దతుతో గెలిచా. అబద్ధాలాడి మీరు అధికారంలోకి వచ్చారు. మీరే రాజీనామా చేయాలి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.... గూబ పగిలిపోద్ది. నేను రాజీనామా చేయను.. నా బొమ్మతో కూడా నేను నెగ్గా.. ఒక్క జగన్మోహన్రెడ్డి బొమ్మతోనే కాదు. నాకు ఫోన్ చేసే వెధవల్లారా బీకేర్.. పనికిమాలిన వెధవల్లారా.. జాగ్రత్తగా ఉండండి. నా జోలికి రావొద్దు. అనవసరంగా రెచ్చగొట్టకండి‘ అని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క రాజధాని(అమరావతి)నే కట్టలేమని చెప్పిన ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఎలా కడుతుందని ఆయన నిలదీశారు. రాజధానిని విశాఖ తరలించాలనుకున్నారని.. అందుకే మూడు రాజధానుల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.