మోదీకి రఘురామ లేఖ

ABN , First Publish Date - 2022-04-04T21:12:38+05:30 IST

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.

మోదీకి రఘురామ లేఖ

ఢిల్లీ: ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. 150 పైగా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురైందని తెలిపారు. అంతకన్నా ఎక్కువగా కోర్టు ధిక్కారణ కేసులు కూడా పెరిగాయని విమర్శించారు. విద్యాసంస్థల ఆవరణల్లో ప్రభుత్వ వ్యవస్థలను నిర్మించొద్దని గతంలో కోర్టు తీర్పులిచ్చిందని అయినా కోర్టు తీర్పును పట్టించుకోలేదని తప్పుబట్టారు. కార్పొరేషన్ల పేరుతో బ్యాంక్‌ రుణాలు పొందడాన్ని కాగ్ తప్పుపట్టిందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-04T21:12:38+05:30 IST