రఘునాథ దేశిక విశిష్ట పురస్కార ప్రదాన సభ
ABN , First Publish Date - 2022-04-21T06:14:46+05:30 IST
మహామహోపాధ్యాయ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి 97వ తిరునక్షత్రం (జయంతి) సందర్భంగా నేడు హనుమకొండలోని కోడం కన్వెన్షన్ హాల్లో...
మహామహోపాధ్యాయ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి 97వ తిరునక్షత్రం (జయంతి) సందర్భంగా నేడు హనుమకొండలోని కోడం కన్వెన్షన్ హాల్లో శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కార ప్రదాన సభ జరుగుతుంది. శ్రీభాష్యం శ్రీనివాసాచార్య (హైద్రాబాద్), చలమచర్ల వేంకట శేషాచార్య (హైద్రాబాద్), శ్రీభాష్యం శ్రీనివాసాచార్య (విశాఖపట్నం), ముడుంబై నర్సింహరంగాచార్య (వరంగల్), చింతలపాటి పూర్ణానందశాస్త్రి (నెల్లూరు), గోవర్ధనం స్వామినాథాచార్య (వరంగల్)లకు 25వేల నగదు, శాలువా, సన్మానపత్రం అందించనున్నాం. ఈ సభలో రామచంద్ర రామానుజ జీయర్స్వామి (భీమవరం), అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్స్వామి (విజయవాడ) పాల్గొంటారు. ఎస్. పురుషోత్తమాచార్య సభాధ్యక్షులు. ఈ సందర్భంగా పరమవైదిక సిద్ధాంత తత్త్వరత్నాకరము, గౌతమ ధర్మసూత్రములు, ఆళ్వారుల దివ్యకథలు అనే పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది.
సముద్రాల శఠకోపాచార్య
ప్రధాన కార్యదర్శి, సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్టు