రెండేళ్ల తర్వాత రాజ్యం మారబోతుంది: రఘునందన్‌రావు

ABN , First Publish Date - 2021-01-19T20:40:14+05:30 IST

ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.

రెండేళ్ల తర్వాత రాజ్యం మారబోతుంది: రఘునందన్‌రావు

సిద్దిపేట జిల్లా: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు వార్డులలో జెండా ఆవిష్కరించి, పార్టీ కార్యాలయాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దుబ్బాక ఉప ఎన్నిక మలుపు తిప్పిందన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టి భారత్ విశ్వ గురువుగా నిలిచిందని కొనియాడారు. కరోనా వచ్చి మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించిందన్నారు. రెండేళ్ల తర్వాత రాజ్యం మారబోతోందన్నారు. సిద్దిపేట పట్టణం ఊరి బయట పచ్చగా.. ఊరి లోపల గుంతల మయంగా ఉందని విమర్శించారు. 1964లో భారతీయ జనసంఘ్ ఇక్కడి నుండే ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ నిర్ణయాల పట్ల ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమైందని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-19T20:40:14+05:30 IST