కేటీఆర్కు సవాల్ విసిరిన రఘునందనరావు
ABN , First Publish Date - 2021-09-29T19:16:43+05:30 IST
ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్తో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వందల
హైదరాబాద్: ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్తో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రఘునందనరావు సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వందల ఐటీ కంపెనీలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. భూ రికార్డుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని తప్పుబట్టారు. డీఎల్ఎఫ్ రెండో యూనిట్ హైదరాబాద్ రాకుండా కేటీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేతకాని తనంతోనే అతిపెద్ద ఐటీ కంపెనీ వేవ్రాక్ హైదరాబాద్ను వీడిందని తెలిపారు. 2011లో రామాంతపూర్లో కట్టిన ఐటీ పార్క్కు కేటీఆర్ ఎందుకు వెళ్ళరు? అని రఘునందనరావు ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ కొంపల్లిలో కడ్తామన్న ఐటీ కంపెనీ ఎక్కడ అని నిలదీశారు. వరంగల్, కరీంనగర్ లో ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారో కేటీఆర్ చెప్పాలి? అని రఘునందనరావు ప్రశ్నించారు.