నన్ను తిట్టి.. మీ భవిష్యత్ కోల్పోవద్దు: రఘురామ

ABN , First Publish Date - 2020-08-03T20:29:28+05:30 IST

వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ హెచ్చరిక చేశారు.

నన్ను తిట్టి.. మీ భవిష్యత్ కోల్పోవద్దు: రఘురామ

న్యూఢిల్లీ: వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ హెచ్చరిక చేశారు. తనను తిట్టి బంగారు రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తనను తిట్టమన్నారని తాత్కాలికంగా తిట్టి పర్మినెంట్‌గా భవిష్యత్తును కోల్పోవద్దన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను నమ్ముకుని.. ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని అనుకుంటే పొరపాటన్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు రూ. 10వేలు ఇచ్చారని.. కానీ ఓట్లు రాలేదన్న విషయం ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి, ప్రజల తిరస్కారానికి గురికావద్దని రఘురామ వైసీపీ నేతలకు సూచించారు.

Updated Date - 2020-08-03T20:29:28+05:30 IST