హైదరాబాద్‌కు రఘురామకృష్ణరాజు తరలింపు

ABN , First Publish Date - 2021-05-18T00:10:36+05:30 IST

గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు తరలించారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు.

హైదరాబాద్‌కు రఘురామకృష్ణరాజు తరలింపు

గుంటూరు: గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు తరలించారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను పోలీసులు తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు అక్కడికి పంపనుంది.


రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - 2021-05-18T00:10:36+05:30 IST