ప్రధాని మోదీకి రఘురామకృష్ణరాజు లేఖ

ABN , First Publish Date - 2021-06-05T00:35:33+05:30 IST

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ కోరారు.

ప్రధాని మోదీకి రఘురామకృష్ణరాజు లేఖ

ఢిల్లీ: ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ కోరారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామ పేర్కొన్నారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని కోరారు. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్‌లో ఉన్నారని, మధుమేహం, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామకృష్ణకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యుల ఆవేదనను అర్థం చేసుకుని, జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను లేఖలో రఘురామకృష్ణరాజు కోరారు.

Updated Date - 2021-06-05T00:35:33+05:30 IST