సీఎం జగన్ ఎవరితో మాట్లాడారో నాకు ఐడియా ఉంది: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-03-02T20:54:40+05:30 IST

ఏపీ డీజీపీ నియామకంపై యూపీఎస్సీకి లేఖ రాశానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సీఎం జగన్ ఎవరితో మాట్లాడారో నాకు ఐడియా ఉంది: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఏపీ డీజీపీ నియామకంపై యూపీఎస్సీకి లేఖ రాశానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసేందుకు.. సీఎం జగన్ తెలంగాణలో ఉన్న ఏ పోలీస్ అధికారితో మాట్లాడారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎవరితో మాట్లాడారో తనకు ఐడియా ఉందన్నారు.


మునిసిపాలిటీ మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసే డ్యూటీ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం సరికాదని రాఘురామ అన్నారు. సజ్జలను చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. వివేకను ఎవరో చంపితే మీరెందుకు రక్తం తుడిచారని, గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించారు. పారదర్శకంగా జరుగుతున్న వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Updated Date - 2022-03-02T20:54:40+05:30 IST