ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి?: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-02-08T21:09:04+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి?: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయి మూడేళ్లు అయిందని, ఇంతవరకు అమరావతి కట్టలేదన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని కట్టలేదని జగన్‌ విమర్శించారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎం అనాలని ప్రశ్నించారు. అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం చేయని తప్పులు, మోసాలు లేవనన్నారు. రాజధాని భూమిలో ఎక్కడ కూడా.. భూమి తాకట్టు లేదా అమ్మకం పెట్టొద్దని హైకోర్టు చెప్పిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2022-02-08T21:09:04+05:30 IST