వంగవీటి రాధాకృష్ణపై జరిగిన రెక్కీపై విచారణ జరిపించాలి: రఘురామ

ABN , First Publish Date - 2021-12-29T20:53:42+05:30 IST

వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ జరిగిందని తెలిసిందని దీనిపై విచారణ జరిపించాలని రఘురామ కోరారు.

వంగవీటి రాధాకృష్ణపై జరిగిన రెక్కీపై విచారణ జరిపించాలి: రఘురామ

న్యూఢిల్లీ: వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ జరిగిందని తెలిసిందని, చాలా దురదృష్టమని, దీనిపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్నారు. రెక్కీపై పారదర్శకమైన విచారణ జరిపించాలన్నారు. సీపీఎస్‌ను పక్కదారి పట్టించేందుకే.. తెరపైకి సినిమా సమస్య తీసుకువచ్చారని విమర్శించారు. హీరో సిద్దార్ధ్‌కి ఏపీతో సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని అంటున్నారని, మరి జస్టిస్ చంద్రు, కనగరాజుకు ఏపీతో పనేంటని ప్రజలంటున్నారన్నారు. జగన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-29T20:53:42+05:30 IST