ఆ విషయం ముందే సాక్షికి ఎలా తెలిసింది?: రఘురామ
ABN , First Publish Date - 2021-08-25T20:45:35+05:30 IST
జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రాకముందే తన పిటిషన్ తిరస్కరించారని సాక్షిలో వార్త ప్రచురించారని...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రాకముందే తన పిటిషన్ తిరస్కరించారని సాక్షిలో వార్తను ఎలా ప్రచురించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి విలేకరికి ఆ సమాచారం ఎలా వచ్చింది.. సాక్షిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
విద్యాసంస్థల్లో ఫీజులను 50 శాతం తగ్గిస్తూ జీవో జారీ చేయడం సరికాదని రఘురామ అభిప్రాయపడ్డారు. డబ్బులు రాక యాజమాన్యాలు 50 శాతం విద్యాసంస్థలను మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. వ్యవస్థను నాశనం చేసి విద్యార్థుల జీవితాలతో అడుకోకూడదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.