రాధామాధవ విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-02-24T05:55:53+05:30 IST
నగరానికి చెందిన రాధామాధవ రసరంజని విద్యార్థులు ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కళోత్సవంలో నృత్య చూడామణి అవార్డులు అందుకున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య ఎస్కే ఖలీల్ తెలిపారు.
గుంటూరు(కల్చరల్), ఫిబ్రవరి23: నగరానికి చెందిన రాధామాధవ రసరంజని విద్యార్థులు ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కళోత్సవంలో నృత్య చూడామణి అవార్డులు అందుకున్నట్లు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య ఎస్కే ఖలీల్ తెలిపారు. విద్యార్థులు పావని, పూజిత, సహస్ర, హాసిని, ప్రవీణ, మౌనిక, సువర్చ, హన్సిక, ఆశ్రితలు ఈ అవార్డులు సొంతం చేసుకున్నట్లు పేర్కొన్నారు.