జాతి ద్రోహులు.. నేటి పాలకులు!

ABN , First Publish Date - 2022-08-15T04:55:31+05:30 IST

నిరంకుశ బ్రి టిష్‌ పాలన కొనసాగాలన్న ఉద్దేశంతో వారికి అనుకూలంగా సైన్యాన్ని ఏర్పాటు చేసిన జాతి ద్రోహులు నేటి భారత పాలకులని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శిం చారు.

జాతి ద్రోహులు.. నేటి పాలకులు!
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 14 : నిరంకుశ బ్రి టిష్‌ పాలన కొనసాగాలన్న ఉద్దేశంతో వారికి అనుకూలంగా సైన్యాన్ని ఏర్పాటు చేసిన జాతి ద్రోహులు నేటి భారత పాలకులని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శిం చారు. ఆదివారం స్థానిక స్ర్తీ శక్తి భవన్‌లో నా టి బ్రిటిష్‌ నిరంకుశత్వం- నేటి బీజేపీ మత రాజ్య పాలన అనే అంశంపై నిర్వహించిన సద స్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ హెడ్గేవార్‌ నేతృత్వం లో 1925లో ఏర్పడిన ఆర్‌ఎస్‌ ఎస్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిందని ప్ర జలు గుర్తుంచుకోవాలన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్‌ పాలకులకు తోడ్ప డటానికి  ఆ సంస్థ సైన్యాన్ని ఏర్పాటు చేసింద న్నారు. అలాంటి దేశ ద్రోహుల వారసులు నే డు భారత పాలకులుగా రాజ్యమేలు తున్నార న్నారు. నాటి స్వాతంత్ర ఉద్యవస్ఫూర్తితో ఏర్పా టైన ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ  ప్రైవే టీకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశ భక్తిపై ప్రచారం చేస్తోందన్నారు.  కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన సబ్సిడీలను ఎతే ్తస్తోందన్నారు. గ్యాసు పెట్రోల్‌ డీజిల్‌ ధరలతో పాటు, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తూ దేశ భక్తి పాఠాలు బోధిస్తున్నార న్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం ఏమి సాధించిం దంటే సమాధానం లేదన్నారు. స్వాతంత్ర పో రాటం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేద న్నారు. వివేకానంద సేవా సంస్ధ అధ్యక్షుడు కరుమూరి వెంకటరమణయ్య మాట్లాడుతూ సకల జాతులు మతాలు కులాలకు నెలవైన భారత లౌకిక ప్రజాస్వామ్య దేశాన్ని మోదీ నే తృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ మత రాజ్యంగా మారుస్తోందన్నారు.ఈ దేశాన్ని బీజేీ ప ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి  కాపాడుకోవాల న్నారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T04:55:31+05:30 IST