విద్యార్థుల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-02-22T08:11:41+05:30 IST

రాష్ట్రంలో సుమారు మూడు వేల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఉంటున్న మూడు లక్షల మంది విద్యార్థులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయట్లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

విద్యార్థుల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరిన ఆర్‌.కృష్ణయ్య 


రాంనగర్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుమారు మూడు వేల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఉంటున్న మూడు లక్షల మంది విద్యార్థులకు పెండింగ్‌ బకాయిలు విడుదల చేయట్లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. విద్యార్థుల మెస్‌, విద్యుత్తు బిల్లులు, అద్దెలు, కాస్మెటిక్‌, ఇతర చార్జీలను గత 7 నెలల నుంచి విడుదల కాలేదని శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ రామకృష్ణారావు దృష్టికి ఆర్‌.కృష్ణయ్య తీసుకొచ్చారు. వాటిని విడుదల చేయాలని వినతిపత్రం అందించారు

Updated Date - 2020-02-22T08:11:41+05:30 IST